chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి – రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి వెంకటసుబ్బయ్య డిమాండ్

బాపట్ల:యానాదులకు (గిరిజనులకు) తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీ హోమ్‌లో యానాదుల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బాపట్ల పట్టణ సీఐ రాంబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో యానాదులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వాలు వారికి కనీస గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు యానాదులకు అందడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా మాత్రమే యానాదులను వినియోగించుకుంటున్నారని, ఆ తర్వాత వారి సమస్యలను పట్టించుకునే వారు ఎవరూ లేరని విమర్శించారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్న యానాదులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Bapatla Local News :యానాదులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి – రాష్ట్ర అధ్యక్షులు ఎందేటి వెంకటసుబ్బయ్య డిమాండ్

అనంతరం బాపట్ల పట్టణ సీఐ రాంబాబు మాట్లాడుతూ, చట్టాల్లోని ముఖ్యమైన అంశాలపై యానాదులకు అవగాహన కల్పించారు. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు, చట్టపరమైన పరిష్కారాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.Bapatla Local News

ఈ సమావేశంలో బాపట్ల జిల్లా యానాదుల యూత్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి గోపి, మహిళా అధ్యక్షులు మరియమ్మతో పాటు ఇతర జిల్లాల అధ్యక్షులు, యానాదుల యూత్ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker