Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Revolutionary Struggle: 20 Years of Denied Yanadi Housing Rights – Permanent Dwelling Plots Must Be Sanctioned Immediately||విప్లవాత్మక పోరాటం: 20 ఏళ్లుగా దక్కని యానాది హౌసింగ్ హక్కులు – వెంటనే శాశ్వత నివేశన స్థలాలు మంజూరు చేయాలి

Revolutionary Struggle: 20 Years of Denied Yanadi Housing Rights – Permanent Dwelling Plots Must Be Sanctioned Immediately||విప్లవాత్మక పోరాటం: 20 ఏళ్లుగా దక్కని యానాది హౌసింగ్ హక్కులు – వెంటనే శాశ్వత నివేశన స్థలాలు మంజూరు చేయాలి

ఏళ్ల తరబడి నివేశన స్థలాలకు నోచుకోని ఎస్టీలు … సిఐటియు నాయకులు కె.శరత్….అనాదిగా నివేషణ స్థలానికి నోచుకోని యానాదులకు వెంటనే శాశ్వత నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సిఐటియు పట్టణ నాయకుడు కె. శరత్ ఆధ్వర్యంలో సూర్యలంక తీరం వెంట నివాసాలు ఉంటున్న యానాదులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు శరత్ మాట్లాడుతూ బాపట్ల మండలం అడవి పంచాయితీ పరిధిలో సూర్యలంక తీర ప్రాంతంలో సుమారు వందేళ్ళ నుండి తాత ముత్తాతల కాలం నుండి సముద్ర జలాలను నమ్ముకుని వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యానాదులకు శాశ్వత నివేశన స్థలాలు లేవు. 20 కుటుంబాలు ఉపాధిలేక కొందరు పాచి పనులు, బిక్షాటన, బీచ్ లో వ్యర్థాలను ఏరుకుంటూ వాటిని అమ్మి వాటితో జీవనం సాగిస్తున్నారు. నేటికి నివాస స్థలాలు లేక సరైన ఇళ్ళు లేక తీరప్రాంతంలో చిన్న చిన్న పూరి పాకలు ఏర్పాటుచేసుకొని ఎండకి ఎండుతూ, వానికి తడుస్తూ పిల్లలు, వృద్ధులు ఇక్కడే కాల గడుపుతున్నారు. బాపట్ల తహసిల్దార్ వీరి సమస్యలపై స్పందించిన బాపట్ల తహసిల్దార్ షేక్ సలీమా వీరు నివాసాలు ఉంటున్న ప్రదేశానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. అందరికీ ఈ ప్రాంతంలోనే నివేశ స్థలాలు ఇస్తామని ఇప్పుడు నివాసాలు అంటున్న స్థలాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. అనేక పర్యాయాలు ఈ సమస్యపై మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆర్జీల ద్వారా విన్నవించుకున్నప్పటికి వీరి సమస్య సమస్య సమస్యగానే ఉఃదన్నారు. పర్యాటకం పేరుతో ఇప్పటికే ఉన్నచోట నుండి అధికారులు దౌర్జన్యంగా నాలుగుచోట్లకు మార్చారు. ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రదేశాన్ని కూడా పర్యాటక అభివృద్ధికి 25 ఎకరాలు ఇచ్చామంటూ తక్షణమే ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జీవనోపాధి దృష్ట్యా జీవనోపాధి దృష్ట్యా అక్కడే నివేశన స్థలాలు ఇచ్చి పక్కాగృహాలు నిర్మించాలని కోరూతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నట్లు శరత్ చెప్పారు. కార్యక్రమంలో శీను, నాగరాజు,కోటయ్య,మేరీ, ఏసమ్మ, చామంతమ్మ పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button