
బాపట్ల:పర్చూరు:-శివరాత్రి తిరునాళ్ల సందర్బంగా మండలంలోని సోపిరాలలో ఉన్న శ్రీ రామకోటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఆంధ్ర–తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ టి.యస్.ఆర్ ఆంజనేయులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం 15 జతల ఎడ్లు పోటీలో పాల్గొంటున్నాయి. నేడు, రేపు కొనసాగనున్న ఈ పందాలను తిలకించేందుకు ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎడ్ల పరుగులతో సోపిరాల గ్రామం సందడి వాతావరణంలో మునిగిపోయింది. భక్తులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పందాలను వీక్షించారు.Baparla Local News
శివరాత్రి వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలు గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.










