
ఏలూరు జిల్లా:21-11-25:- లింగపాలెం మండలం గోకవరం సొసైటీ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యేపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని శుక్రవారం మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు, చింతలపూడి నియోజకవర్గంలో మంచి మనసున్న వ్యక్తిగా, ప్రజా సేవలో చిరస్మరణీయ ముద్ర వేసిన నాయకుడిగా సూరిబాబు నిలిచారని గుర్తుచేసుకున్నారు. అలాంటి ప్రజాహితసేవకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, ఆయన తొలి వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కంభం విజయరాజు, లింగపాలెం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నపునేని శాంతారావు, కీలక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై యేపూరి సూర్యనారాయణరావుకు నివాళులు అర్పించారు.







