ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News “VIGNAN CHAIRMAN DR. LAVU RATHAIAH..

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

నేటి ముగింపు  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్‌ తిపాఠి, గౌరవ అతిథిగా యాంకర్, యాక్టర్‌ విజ్ఞాన్‌ పూర్వ విద్యార్థి ప్రదీప్‌ మాచిరాజు రాక విద్యార్థులందరూ వాస్తవికంగా ఉండి… ఆశావాదులుగా ముందుకు సాగాలని ఏపీఎస్‌సీహెచ్‌ఈ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) చైర్మన్‌ ప్రొఫెసర్‌ కే.మధుమూర్తి అన్నారు. స్థానిక గుంటూరు రూరల్‌ మండలం పలకలూరులోని విజ్ఞాన్‌ నిరుల మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి టెక్‌ ఒడిస్సీ, కల్చరల్‌ కాస్కేడ్, క్రియేటివ్‌ కాన్వస్, వర్డ్‌ సింఫణీ, బిజినెస్‌ పరేడ్, చిల్‌ థ్రిల్, స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ ‘‘ నిరులోత్సవ్‌–2కే25’’ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కే.మధుమూర్తి మాట్లాడుతూ మన జీవితంలో విజయాన్ని సాధించాలంటే రెండు ముఖ్యమైన లక్షణాలు అవసరమన్నారు.  అవి వాస్తవికత మరియు ఆశావాదం. వాస్తవికత మనల్ని ప్రస్తుత పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. మన బలాలు, బలహీనతలు, అవకాశాలు, అడ్డంకులను నిజాయితీగా స్వీకరించడమే వాస్తవికతని తెలియజేసారు. అలాగే, ఆశావాదం అంటే ప్రతీ సమస్యలో ఒక పరిష్కారాన్ని చూడగల శక్తి అని, ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మనల్ని లక్ష్యాల వైపు నడిపిస్తుందన్నారు. వాస్తవికత మరియు ఆశావాదం ఒకే బరువు తూచే రెండు భుజాల వలె ఉంటాయని, వాస్తవికత మనలను నేలపై నిలబెడుతుంటే, ఆశావాదం మనల్ని ఆకాశాన్ని గమ్యంగా చేసుకునేలా ప్రోత్సహిస్తుందన్నారు. కాబట్టి, జీవితం పట్ల నిజాయితీగా ఉండండి, కానీ ఆశను కోల్పోకండి. వాస్తవికంగా ఆలోచించండి, ఆశావాదిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఇక్కడే డిసైడ్‌ చేసుకోండి : ఐబీఎం ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ టెక్నికల్‌ టీమ్‌ లీడ్, విజ్ఞాన్‌ నిరుల పూర్వ విద్యార్థి నారేడ్ల లావణ్య విద్యార్థులు జీవితంలో ఏమి సాధించాలనేది ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ఉన్నప్పుడే డిసైడ్‌ చేసుకుని, దానికోసం కష్టపడాలని కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఐబీఎం ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ టెక్నికల్‌ టీమ్‌ లీడ్, విజ్ఞాన్‌ నిరుల పూర్వ విద్యార్థి నారేడ్ల లావణ్య అన్నారు. ఇదే కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నేను… ఈ రోజు కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులందరికీ మోటివేషన్‌తో పాటు సెల్ఫ్‌ డిసిప్లేన్‌ ఉండాలన్నారు. విద్యార్థులు ఏదైనా పనిలో నూరు శాతం ఎఫర్ట్‌ పెడితేనే విజయం లభిస్తుందన్నారు. వాళ్లు మాత్రమే నిలబడతారు : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులు జీవితంలో మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలంటే… కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పడు నేర్చుకునే వాళ్లు మాత్రమే నిలబడతారని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. భవిష్యత్‌ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానిదేనని పేర్కొన్నారు. లైఫ్‌ స్కిల్స్, టీమ్‌ స్పిరిట్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ వంటివి క్లాస్‌రూమ్‌తో పాటు ఆటల్లో ఎక్కువగా పాల్గొనే విద్యార్థుల్లో త్వరగా డెవలప్‌ అవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఉత్సవాల్లో ఎవరైతే ఎక్కువగా పాల్గొంటారో వాళ్లే క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో మొదట ఉద్యోగాలు సాధిస్తారని వెల్లడించారు. గడిచిన 25 సంవత్సరాలల్లో సమాజంలో సోషల్‌ చేంజ్‌ బాగా వచ్చిందన్నారు. ఎకనామిక్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ డెవలప్‌మెంట్‌ వంటివి జరగాలంటే మహిళలతోనే సాధ్యమన్నారు. విద్యార్థులు ఓటములను కూడా ఆస్వాదించాలన్నారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్‌ తిపాఠి, గౌరవ అతిథిగా యాంకర్, యాక్టర్‌ విజ్ఞాన్‌ పూర్వ విద్యార్థి ప్రదీప్‌ మాచిరాజు రానున్నారు. ఫెస్ట్‌కు సుమారుగా 200 కళాశాలల నుంచి 15 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 45కి పైగా విభాగాల్లో పోటీలు
జాతీయ ఉత్సవాల్లో భాగంగా మొత్తం 45కు పైగా అంశాల్లో పోటీలు నిర్వహించారు. డాన్స్, మ్యూజిక్, థియేటర్‌ షో, ఫ్యాషన్‌ వార్, టాలెంట్‌ హంట్, మైమ్, రీలాథాన్, టీజర్‌ ట్విస్ట్, డూడుల్‌ వార్, పేయింటింగ్, మాక్‌ పార్లిమెంట్, పొయెట్రీ స్లామ్, డిబేట్, షార్ట్‌ స్టోరీ, బిజినెస్‌ క్విజ్, యంగ్‌ మేనేజర్, మార్కెట్‌ మేకర్స్, త్రోబాల్, ఖోఖో, టెన్నికాయిట్, షాట్‌పుట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్, చెస్, క్యారమ్స్, 100 మీటర్ల పరుగు పందెం, మిస్‌ నిరులోత్సవ్, మిస్టర్‌ నిరులోత్సవ్, టెక్నికల్‌ క్విజ్, రాపిడ్‌ కోడ్, రిసిస్టర్‌ రష్, ఎలక్ట్రో క్రాస్, డబ స్మాష్, సినీ క్వెస్ట్, విజన్‌ మాస్టర్‌… ఇంకా తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు నిరులోత్సవ్‌–2కే25 సంబరాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కళాకారులు పలు నృత్య రూపకాలకు అనుగుణంగా నర్తించి మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఓలలాడించాయి. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, నిరుల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాతూరి రాధిక, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker