chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :39వ డివిజన్ టీడీపీ నేతలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి

గుంటూరు:- పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం 39వ డివిజన్ టీడీపీ నేతలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సన్నద్ధత, కమిటీ పునర్వ్యవస్థీకరణపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

డివిజన్ స్థాయి నుంచే కమిటీల్లో మార్పులు చేసి, కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించడంతో పాటు పాత అనుభవాన్ని వినియోగించుకుంటూ పూర్తి స్థాయిలో షఫ్లింగ్ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త శక్తితో కమిటీలను బలోపేతం చేస్తూ, ప్రతి డివిజన్‌లో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలతో పరిచయ వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Guntur Local News :39వ డివిజన్ టీడీపీ నేతలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందుకోసం కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు ఆయా డివిజన్లలోని స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. “మన పనితోనే గుర్తింపు తెచ్చుకోవాలి” అనే నినాదంతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నామని పేర్కొన్నారు.

Guntur Local News :39వ డివిజన్ టీడీపీ నేతలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి

పదవులు రాకపోవడం లేదా వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, అలాంటి వారందరికీ నేరుగా అవకాశం కల్పించేందుకే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని రూపొందించామని ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యేను నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే వేదిక ఇదని, ఆర్థిక, సామాజిక, మానసిక సమస్యల పరిష్కారానికి తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ మహమ్మద్ రఫీ, గుంటుపల్లి గురువయ్య, సింగంశెట్టి వీరయ్య, అబ్దుల్ ఖాదర్ బుడే, రుస్తుం బాబు, రఫీతో పాటు టీడీపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Guntur Local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker