
వినుకొండ: నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. వినుకొండ పట్టణం కొత్తపేటలోని తన కార్యాలయంలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ ప్రజా దర్బార్ జరగనుందిPalanadu gilla lo police lu పల్నాడు జిల్లాలో పోలీసులు అవగాహన కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను ప్రభుత్వ చీఫ్ విప్ స్వయంగా స్వీకరిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, విజ్ఞప్తులను నేరుగా తెలియజేసేందుకు ఇది మంచి అవకాశం కావడంతో, ఎక్కువ సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయ వర్గాలు తెలిపారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.










