
బీసీ నాయకులు దేవెళ్ళ వెంకట్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రాడీపేట లోని షిర్డీసాయి దీనజన సేవాసమితి లో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. నసీర్ నేతృత్వంలో తూర్పు నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో నసీర్ మంత్రి పదవిని దక్కించుకోవాలని వారు ఆకాంక్షించారు. పార్టీ సీనియర్ నాయకులు జాగర్లమూడి శ్రీనివాస్, కార్పొరేటర్యల్లావుల అశోక్, ఐలా శ్రీనివాస్, యేల్చూరి కిరణ్, ఐలా పవన్, నండూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.





