ఆంధ్రప్రదేశ్
AP Congress President Sharmila said that former CM YS Jagan is coming to the people only after YSRCP lost in the elections.
ఎన్నికల్లో YSRCP ఓడిపోయాకే మాజీ సీఎం YS Jagan ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఉనికి కోసం బలప్రదర్శనలు చేస్తున్నారని.. జనం మరిచిపోతారనే ఈ తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో మీడియాతో షర్మిల మాట్లాడారు.
జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం దురదృష్టకరం. జగన్ దీన్ని గమనించకపోవడం బాధాకరం. ఈ ఘటనను ఫేక్ అనడం తప్పు. మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. ప్రజలను చంపుతున్నా జగన్ పర్యటనలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? అసెంబ్లీ వేదికగా ఆయన పోరాటాలు చేయాలి.
అక్కడికి వెళ్లే దమ్ములేకే బయట మాట్లాడుతున్నారు” అని షర్మిల విమర్శించారు.