
విజయవాడ, ఫిబ్రవరి 1:ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “డ్రగ్స్ పై దండయాత్ర” అవగాహన కార్యక్రమం ఆరో రోజుకు చేరుకుంది. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, డి.సి.పి. శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్ పర్యవేక్షణలో గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఘనంగా సైకిల్ యాత్ర నిర్వహించారు.

“మత్తును ఆపి చూడు – జీవితాన్ని గెలిచి చూడు”, “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాలతో భాను నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మధురానగర్, దేవి నగర్, దావుబుచ్చయ్య కాలనీ, గద్దె వారి పొలాలు మీదుగా ఉలవచ్చారు కంపెనీ వరకు కొనసాగింది.NTR VIJAYAWADA News

ఈ కార్యక్రమంలో మదర్ తెరిస్సా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విమ్స్ కళాశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీకి ఉత్సాహభరితమైన మద్దతు తెలిపారు. బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో సుమారు 400 మంది విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఎన్డీపీఎస్ చట్టం అంశాలపై అవగాహన కల్పించారు.

ఆటపాటలు, కేరింతల మధ్య
“DRUGS VADDU… JEEVITHAM MUDDU”
అనే నినాదం మార్మోగగా, యువత మనసు గెలిచిన ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన పొందింది.
ఈ సైకిల్ యాత్రలో ఏడీసీపీ ఎంబీఎం మురళీ కృష్ణ, సెంట్రల్ ఏసీపీ దామోదర్, గుణదల ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, టాస్క్ ఫోర్స్, ఈగల్ బృందాలు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత జిల్లాగా ఎన్.టి.ఆర్ జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ అవగాహన కార్యక్రమానికి ప్రజలు, యువత స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.










