GUNTUR NEWS : స్వామి వివేకానంద జీవిత చరిత్ర నేటి యువతరానికి స్పూర్తినిస్తుంది – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
యువతరానినికి వివేకానంద జీవిత చరిత్ర ఎంతో స్పూర్తినిస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…
పట్టాభిపురంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం ఆసియా ఖండంలోనే అతిపెద్ద 2వ కాంస్య విగ్రహాము వద్ద 163వ జయంతి సందర్భంగా నివాళులర్పించటం గర్వంగా ఉందని, పట్టాభిపురంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి నా లాంటి వారిలో ఎంతోమందికి స్ఫూర్తిని నింపే విధంగా చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలుపుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యులు స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవముగా జరుపుకుంటున్నామని, భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు వివేకానంద అని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి కొనియాడారు. నేటి యువత స్వామి వివేకానంద జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మన ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ప్రపంచ దేశాల్లో పరివర్తన తీసుకొచ్చిన భారతీయ శక్తి వివేకానంద అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరంటి వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.