ఆంధ్రప్రదేశ్
AP NEWS: బాధిత మహిళలకు నేషనల్ కమిషన్ అండగా ఉంటుంది
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు లో మహిళా బాధితుల నుండి వినతి పత్రాలు సేకరించారు. మహిళలకు సంబంధించిన పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. మహిళలు ఎలాంటి వివక్షతకు గురైన తక్షణమే మహిళా కమిషన్ ని సంప్రదించాలని సూచించారు. మహిళలకు సంబంధించిన కేసులో పరిష్కారంలో నిర్లక్ష్యం వ బాధ్యులపై చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, ఇతర ప్రముఖులు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిని మర్యాదపూర్వకంగా కలిశారు.