GUTNUR NEWS.:రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్…
రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పదేళ్ళలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని ఆస్థానాన్ని నిలబెట్టుకు నేందుకు సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంక్ గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని వ్యాపారాలకు మెరుగైన,సాధారణంగా సరళమైన,నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు.2024లో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) నేతృత్వంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP) 2024 ద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.సులభతర వాణిజ్య విధానంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆదిశగా ఆయా శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి ఎపిని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ అంశంలో ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎపికి ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్న నేపధ్యంలో దీనిపై సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎపిని అగ్రగామిగా నిలపాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం బిసినెస్ రిఫార్స్మ్ యాక్షన్ ప్లాన్(BRAP)2024కు సంబంధించి ఫిబ్రవరి 15 తుది గడువుగా పెట్టిందని కావున ఈనెల 10వతేదీ లోగా సంబంధిత శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించిన కంప్లయెన్స్ ప్రక్రియను పూర్తి చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి ఇంకా కొన్ని శాఖలు నోడలు అధికారులను నియమించాల్సి ఉందని వారిని వెంటనే నియామించాలని అన్నారు.
అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ బిసినెస్ రిఫార్స్మ్ యాక్షన్ ప్లాన్(BRAP)2024కు 28 శాఖలకు చెందిన 58 అంశాల్లో 435 రిఫార్మ్స్ కు చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఇప్పటికే చాలా వరకూ రిఫార్స్మ్ కంప్లయన్స్ చేశారని మిగతా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా శాఖలకు సూచించారు.ఫిబ్రవరి 15వ తేదీ తుది గడువుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున ఈఅంశానికి సంబంధించి పలు అంశాలపై సంబంధిత శాఖలు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.
ఈసమావేశంలో ఏపిఐఐసి విసి అండ్ ఎండి అభిషిక్థ్ కిషోర్,స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేన్ల శాఖ ఐజి హరినారాయణ,న్యాయ శాఖ అదనపు కార్యదర్శి వి.సునీత పాల్గొన్నారు.అదే విధంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్పి సిసోడియా,అనంతరాము,వాణి ప్రసాద్,ముఖ్య కార్యదర్శులు ఎస్.సురేశ్ కుమార్,శశిభూషణ్ కుమార్ తదితర అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.