ఆంధ్రప్రదేశ్గుంటూరు
Guntur News: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి
BANJARA SEVA SANGHAM MEETING
గిరిజనుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ నాయకులు లక్ష్మానాయక్ సూచించారు. ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గిరిజన తండాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బంజారా సేవా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామనివెంకటరమణ నాయక్, చక్రి నాయక్, రాంబాబు నాయక్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.