
విశాఖపట్నం, ఫిబ్రవరి 18:– విశాఖపట్నం విమానాశ్రయంలో ఈరోజు ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ఉదయం నుంచి సుడిగాలి పర్యటనలు నిర్వహించిన కేంద్ర మంత్రి Ram Mohan Naidu, విశాఖలో నిర్వహించిన ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని ముగించుకుని ఢిల్లీకి బయలుదేరే క్రమంలో విమానాశ్రయానికి చేరుకున్నారు.

వి.ఐ.పి లాంజ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ జాగిలం ‘రాకీ’ ఆయన దృష్టిని ఆకర్షించింది. పెంపుడు, సాధు జంతువులపై అమితమైన ప్రేమ కలిగిన మంత్రి గారు వెంటనే రాకీ వద్దకు చేరుకుని మచ్చిక చేసుకుని కరచాలనం చేశారు. ఈ దృశ్యం అక్కడున్న అధికారులను, ప్రయాణికులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలోని అనేక విమానాశ్రయాల్లో భద్రతా పరంగా పోలీస్ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విశ్వాసం, విధేయతకు ప్రతీకలైన ఈ జాగిలాలు భద్రతా వ్యవస్థలో ముఖ్య భాగమని వివరించారు. స్ఫోటక పదార్థాల గుర్తింపు నుంచి అనుమానాస్పద వస్తువుల తనిఖీ వరకు జాగిలాల సేవలు అపారమని తెలిపారు.
కాగా, జంతు ప్రేమికుడిగా పేరుగాంచిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలోని తన నివాసంలో గోశాల నిర్వహిస్తూ ఉండగా, శ్రీకాకుళం మరియు ఢిల్లీలోని ఇళ్లలో నాలుగు జాగిలాలను పెంచుతున్న విషయం తెలిసిందే.Visakhapatanam Local News :రోజ్గార్ మేళా ఘన విజయం
విశాఖ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకున్న ఈ అనుహ్యమైన, హృద్యమైన క్షణం అక్కడున్న వారిలో చర్చనీయాంశంగా మారింది. 🐶







