
జగ్గయ్యపేట:నవంబర్ 11 :-జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జయంతిపురం గ్రామంలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించబోయే ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు సోమవారం భూమి పూజ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, ఆర్డీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ,“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. జయంతిపురంలో ప్రారంభమవుతున్న ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, జగ్గయ్యపేట ప్రాంతాన్ని పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దుతుంది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు, పెనుగంచిప్రోలు టిడిపి అధ్యక్షులు చింతల సీతారామయ్య, వత్సవాయి టిడిపి అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు, కాసారం కెనాల్ చైర్మన్ కానూరి కిషోర్, బండ్ల జాన్ ప్రకాష్, రావూరి విశ్వనాథం, కారుపాటి డేవిడ్, గుండ్ల కృష్ణారావు, మాదినేని వెంకట్రావు, అనుమాల వేదాద్రి, మల్లెబోయిన జ్వాలా, పసుమర్తి మహేష్, ఇస్లావతు శ్రీను, సేటియా, బొడ్డు జయ, నంబూరి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.







