పల్నాడు జిల్లా:– కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంలా మారిందని పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
తిరుమల లడ్డు ప్రసాదం వివాదాన్ని డైవర్ట్ చేయడానికే తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని ప్రశ్నించారు.
లడ్డు ప్రసాదం వ్యవహారానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వస్తున్న సమయంలో అంబటి రాంబాబు పై వివిధ నియోజకవర్గాల నుంచి సమీకరించిన సుమారు 2000 మంది కార్యకర్తలతో కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆయన ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా దాడులు చేశారని పేర్కొన్నారు.PALANADU – ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ వెంకట ప్రసాద్ కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన వైసిపి సీనియర్ నాయకులు నక్కా నాగిరెడ్డి..
ఈ ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించారని, దాడులను అడ్డుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబు పై జరిగిన దాడి పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు.










