Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

NTR vijayawada news:క్వారీ గుంట వద్ద నిల్వ నీరు తొలగించాలని ప్రజల విజ్ఞప్తి

నందిగామ, నవంబర్ 5:-మెంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల నందిగామ మున్సిపాలిటీలోని 18వ వార్డు క్వారీ గుంట ప్రాంతంలో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సుమారు 15 కుటుంబాల ఇళ్లలో వరద నీరు, మురుగు నీరు ఇంకా నిల్వ ఉండటంతో జీవనాధారం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో సిపిఎం నందిగామ కార్యదర్శి కటారపు గోపాల్ నేతృత్వంలో పార్టీ నాయకులు బుధవారం ఉమాకాలనీ ఫేజ్‌లోని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ, “గత నెల 27, 28 తేదీల్లో కురిసిన వర్షాల తర్వాత ఇప్పటివరకు నీరు తొలగించలేదు. ప్రజలు, చిన్నపిల్లలు మురుగు నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. పాములు, జెర్రిపోతులు సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది,” అని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలు రాత్రివేళ దోమల విపత్తుతో, దుర్వాసనతో బాధపడుతున్నారని, పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని తెలిపారు. “రోడ్లు కూడా కనపడని స్థాయిలో నీళ్లు నిలిచిపోయాయి. అధికారులు రేపే నీరు తోడేస్తామంటూ మాటలు ఇచ్చి మాయమయ్యారు. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడం లేదు,” అని బాధితులు మండిపడ్డారు.సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుని, నిల్వ నీరు తొలగించే మార్గం ఏర్పాటుచేయాలని సిపిఎం నాయకులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపి నాయిక్, బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button