chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

నార్త్ డివిజన్లలో భద్రతా ప్రమాణాల బలోపేతంపై ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు

గుంటూరు, అక్టోబర్ 7: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం భద్రతా అవగాహన మరియు సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ అధ్యక్షతన తుళ్లూరు మరియు నార్త్ సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఈ సమీక్ష నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఎస్పీ జిందాల్ కీలక భద్రతా అంశాలపై అధికారులను ఆరా తీశారు. ముఖ్యంగా వీవీఐపీ మరియు వీఐపీలు అధికంగా నివసించే ఈ ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలని, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు
గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల చట్టవిరుద్ధ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన ఎస్పీ, పాత నేరస్థుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. వారి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విద్యార్థులకు పూర్తి భద్రత
ఈ రెండు సబ్ డివిజన్ల పరిధిలో ప్రఖ్యాత విద్యాసంస్థలు అధికంగా ఉండటంతో విద్యార్థినీ, విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించేందుకు పగలు, రాత్రి గస్తీని పటిష్టం చేయాలని సూచించారు.

ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సీసీటీవీ, డ్రోన్ పర్యవేక్షణపై దృష్టి
సచివాలయం, హైకోర్టు పరిసర ప్రాంతాల్లో జడ్జిలు, వీఐపీలు రాకపోకల సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అంతే కాకుండా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీటీవీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, డ్రోన్ బీట్ నిర్వహిస్తూ ఓపెన్ డ్రింకింగ్, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker