
Palanadu :వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, కమ్మవారిపాలెం ఎస్సీ కాలనీలో ‘P4’ కార్యక్రమం కింద దత్తత తీసుకున్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పంపిణీ చేశారు.
పేదరిక నిర్మూలన, సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో ఎంపికైన కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. palanaduపేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి కుటుంబానికి ప్రాథమిక అవసరాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.










