పల్నాడు జిల్లా,చిలకలూరిపేట:
చిలకలూరిపేట పట్టణంలోని నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కృష్ణ మహల్ రోడ్డు ను తవ్వి పగల గొటి ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా గాలికి వదిలేసి వెళ్లి పోయారు. ఈ రోడ్డును ఎందుకు పగలగొట్టారు ఏదైనా మరమ్మత్తుల కోసము అధికారులు చేసిన పని లేక ప్రైవేటు వ్యక్తుల పనే అనేది తెలియాల్సి ఉంది . ఆదివారం 4గంటల సమయంలో బాగున్న రోడ్డుని అడ్డగోలుగా పగలగొట్టి ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా ఆ పగలగొట్టిన రోడ్డు రాళ్ళముక్కలను అదే రోడ్డు ఉంచి బాధ్యతారహితంగా వదిలేశారు.ఏదైనా మరమ్మత్తుల కోసం అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు అయినా కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానీ అనుమతి లేకుండా నిత్యం రద్దీగా ఉండే రోడ్డు పగలగొట్టవచ్చునా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.