Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad news వైన్‌ షాప్‌ టెండర్లలో ఇంకా ఆంధ్ర వ్యాపారుల ఆధిపత్యం

హైదరాబాద్‌:21-10-25:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్లు గడిచినా వైన్‌ షాప్‌ టెండర్లలో ఇంకా ఆంధ్ర వ్యాపారుల ఆధిపత్యం కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌ గౌడ్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌ నాంపల్లి అప్కరి భవన్‌లోని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ను దామోదర్‌ గౌడ్‌ కలిసి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆంధ్ర వ్యాపారులకు సహకరిస్తూ తెలంగాణ వ్యాపారుల ప్రయోజనాలను పక్కనబెడుతున్నారని ఆరోపించారు. “ఆంధ్ర సిండికేట్‌ వ్యాపారులు అక్రమంగా రాష్ట్రంలో చొరబడి వ్యాపారాలు చేస్తూ స్థానిక వ్యాపారుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారు,” అని దామోదర్‌ గౌడ్‌ మండిపడ్డారు.

అంతేకాకుండా, “ఆంధ్ర వ్యాపారులకోసమే టెండర్ల గడువు తేదీని అధికారులు ఉద్దేశపూర్వకంగా పెంచినట్టుంది” అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌లో టెండర్లు వేసే ప్రయత్నం చేస్తే అక్కడ దాడులు జరుగుతాయని, అటువంటి వ్యక్తులకు ఇక్కడ టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తక్షణమే జోక్యం చేసుకుని, ఆంధ్ర వ్యాపారులకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని దామోదర్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button