chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

BC Reservation :బీసీ రిజర్వేషన్లను తొక్కేస్తున్న రేవంత్ ప్రభుత్వం – ఎర్ర సత్యనారాయణ విమర్శ

హైదరాబాద్‌, నవంబర్‌ 5:-రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు పూర్తయ్యాక, కోర్టు తీర్పులను సాకుగా చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు సాగుతోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు.బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టులో గవర్నర్‌, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బిల్లుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గుర్తు చేయలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకే అవగాహనతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కేంద్రం ద్వారానే సాధ్యమయ్యే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా, కేంద్ర అప్రకటిత అనుబంధ సంస్థల జీవోలతో ‘రిజర్వేషన్ పెంపు’ అనే ముసుగులో బీసీల హక్కులను హరిస్తోందని ఎర్ర సత్యనారాయణ విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా, పాత విధానంతోనే ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయం సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్నారని ఆరోపిస్తూ, ఆయనను “బీసీలకు ప్రత్యక్ష శత్రువుగా” అభివర్ణించారు. రేవంత్‌ రెడ్డి హటావో నినాదంతో ఉద్యమ శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.BCఈ నెల 9న గద్వాల్‌లో, 22న నిజామాబాద్‌లో, 27న సూర్యాపేటలో, 30న మహబూబ్‌నగర్‌లో “బీసీ గర్జన మహాసభలు” నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో కేంద్రీకృత పోరాటం నుంచి వికేంద్రీకృత ఉద్యమాల దిశగా వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker