chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad naampalli :హైదరాబాద్ నాంపల్లి ప్యాప్సి భవన్‌లోఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ నిర్వహిస్తున్నహైపెక్స్ 2025 ఎగ్జిబిషన్‌

హైదరాబాద్ నాంపల్లి ప్యాప్సి భవన్‌లో పురాతన వస్తువుల అభిమానులకు పండగ వాతావరణం నెలకొంది. ఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ నిర్వహిస్తున్న “హైపెక్స్ 2025” ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ జీఎం శ్రీపాద రామదాస్, సొసైటీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

Hyderabad naampalli :హైదరాబాద్ నాంపల్లి ప్యాప్సి భవన్‌లోఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ నిర్వహిస్తున్నహైపెక్స్ 2025 ఎగ్జిబిషన్‌

వందేళ్ల చరిత్రను ప్రతిబింబించే స్టాంపులు, పాత కరెన్సీ నోట్లు, నాణేలు, అరుదైన పురాతన వస్తువులు—మొత్తం ఒకేచోట అందుబాటులో ఉండటంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు, యువతకు చరిత్రపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని సొసైటీ కార్యదర్శి సాగి శ్రీనివాసరాజు చెప్పారు.

Hyderabad naampalli :హైదరాబాద్ నాంపల్లి ప్యాప్సి భవన్‌లోఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ నిర్వహిస్తున్నహైపెక్స్ 2025 ఎగ్జిబిషన్‌

1962లో స్థాపితమైన ఈ సంస్థ దేశంలోని ప్రముఖ సేకరణాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువస్తోందని తెలిపారు. కాకతీయుల నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు… నిజాం కాలం వరకు వివిధ రాజవంశాల నాణాలు, స్టాంపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన 60 స్టాళ్లు ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు.మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్‌లో సందర్శకులు కేవలం వీక్షించడమే కాకుండా… తమకు నచ్చిన వింటేజ్ ఐటెమ్స్‌ను కొనుగోలు చేసుకునే అవకాశమూ ఉంది. ఎన్నో ఏళ్ల పురాతన చరిత్రను చెబుతున్న అరుదైన వస్తువులు చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker