chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :మహిళల సమస్యలకు సత్వర పరిష్కారం దిశగా ‘నారి న్యాయ్’

హైదరాబాద్: లక్డికపుల్:-మహిళల సమస్యలకు వేగంగా న్యాయం అందించాలనే లక్ష్యంతో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ‘నారి న్యాయ్’ కార్యక్రమాన్ని లక్డికపుల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాధిత మహిళల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించారు.

Hyderabad Local News :మహిళల సమస్యలకు సత్వర పరిష్కారం దిశగా ‘నారి న్యాయ్’

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కధీరవన్ పాలనీ, షీటీమ్ డీసీపీ లావణ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. బాధిత మహిళల సమస్యలను చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై నేరెళ్ళ శారద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు సత్వర న్యాయం చేయడంలో ఎలాంటి అలసత్వం సహించబోమని స్పష్టం చేస్తూ, బాధ్యతగా వ్యవహరించని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Hyderabad Local News :మహిళల సమస్యలకు సత్వర పరిష్కారం దిశగా ‘నారి న్యాయ్’

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలకు అండగా నిలిచేందుకే ‘నారి న్యాయ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందో లేదో అనే సందేహం మహిళల్లో ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో వారికి ధైర్యం ఇచ్చేలా మహిళా కమిషన్ పనిచేస్తుందన్నారు.Hyderabad Local News అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘నారి న్యాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బాధితుల్లో ఎక్కువగా మైనార్టీ మహిళలే ఉన్నారని, ముఖ్యంగా రెండో పెళ్లి, కట్న వేధింపుల కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు తప్పనిసరిగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నేరెళ్ళ శారద స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker