chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా

Telangana Local News :మేడ్చల్ జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించిన రవాణా శాఖ

మేడ్చల్: జనవరి 2:- మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గురువారం మేడ్చల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయ ఆవరణలో వాహన వినియోగదారులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా వాహనదారులతో, “నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, ట్రాఫిక్ నియమాలను ఎప్పటికీ ఉల్లంఘించనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని” ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు సూచించారు.Hyderabad news డ్రైవింగ్ సమయంలో నిద్రగా అనిపిస్తే వాహనాన్ని పక్కకు ఆపి విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు.

రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించకపోతే విలువైన ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, ఒక నిండు ప్రాణం పోతే కుటుంబం మొత్తం అనాథలవుతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి రహదారి భద్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, వాహనదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker