ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: 16, 342 ఉపాధ్యాయ పోస్టులతో త్వరలో మెగా డీఎస్సీ

MINISTER LOKESH STATMENT IN ASSEMBLY

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. “రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలను పూర్తిచేయాలంటే 3వేల కోట్లు ఖర్చు అవుతుంది. మన బడి-మన భవిష్యత్తు.. నినాదంతో ఉపాధి హమీ కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. ‘డ్రగ్స్ వద్దు బ్రో’.. అనే క్యాంపెయిన్ ను ఈ ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పాఠశాల, కాలేజీల్లో ‘ఈగల్’ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. పేరెంట్-టీచర్ మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker