గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిన్నపాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 14 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది.పదిమంది రైతులు ఒక్కొక్కరు ఎకరన్నర , రెండు ఎకరాలు చొప్పున మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న సాగు కి ఎకరానికి 50,000 నుండి 60,000 దాకా పెట్టుబడి అయింది. అయితే కరెంట్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల తెగి క్రిందనున్న మొక్కజొన్న పంటపై పడి మంటలు చెలరేగాయి.పంట మెత్తం దగ్దంమైనదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.కేవలం లైన్మెన్ ఆలస్యం అసమర్థత వల్లే ఈ కరెంటు వైర్లు కిందపడి షార్ట్ సర్క్యూట్ సంబంధించినది అని రైతులు తెలిపారు.స్థానిక రైతులు దగ్గర నుంచి మోటార్ కి ఫీజు వేయాలంటే లైన్ మెన్ 200 నుంచి 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు.గతంలో మోటర్లు బిగించడానికి ఒక రైతు దగ్గర నుంచి ఒక మోటార్కు 20 నుండి 40,000 వసూలు చేశాడని స్థానిక రైతులు ఆరోపించారు.



