ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ను ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మతెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారంఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్జరుగుతుందని చెప్పారు. ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగ అభ్యర్థులు తమ సమస్యలను విన్నవించవచ్చని ఆయన చెప్పారు. జిల్లా అధికారులు అందరు హాజరు కావాలని ఆయన ఆదేశించారు.



