బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని చిన్నగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ రామచంద్ర నగర్ గ్రామంలో రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ యువత, పెద్దలు సమన్వయంతో ఏర్పాట్లు చేపడుతున్నారు.
ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారిని ఆహ్వానిస్తూ రామచంద్ర నగర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వాన పత్రం అందజేశారు. ఎమ్మెల్యే గారు కూడా గ్రామస్థుల ఆహ్వానాన్ని స్వీకరించి, కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కావడంతో పలు జిల్లాల నుంచి జట్లు పాల్గొనే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
గ్రామంలో ఈ టోర్నమెంట్ నిర్వహణపై స్థానిక ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమం విజయవంతం కావాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.



