GUNTUR CITY NEWS: గుంటూరు NSUI లో విద్యార్థులు భారీ చేరికలు

Karthik

ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం నేతృత్వంలో, గుంటూరు నగర NSUI అధ్యక్షులు పోపురి మదన్ బాబు ఆధ్వర్యంలో NSUI లోకి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరికలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పి.కిరణ్ తేజ మరియు వారి మిత్ర బృందం NSUI లో చేరారు. NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం వారికి NSUI కండువా కప్పి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షేక్. కరీం మాట్లాడుతూరాష్ట్ర PCC వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్. మస్తాన్ వలి , రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగం శెట్టి ఈశ్వరరావు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా స్థాయిలో NSUI ను మరింత బలోపేతం చేస్తూ, నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ సేవా కార్యక్రమాల్లో ముందుంటామని తెలిపారు.

Author
Share This Article
Leave a review