GUNTUR CITY NEWS: గుంటూరులో కొరతపై స్పందించిన వైఎస్సార్సీపీ

Karthik

గుంటూరులో గత కొన్ని రోజులుగా నెలకొన్న డీజిల్ కొరత కారణంగా వాహనదారులు, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గుంటూరు YSRCP నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా తీవ్రంగా స్పందించారు. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులను ఆమె స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న ప్రజలతో ఆమె మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న పెట్రోల్ బంకులకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రజల గోడు: డీజిల్ దొరక్క రవాణా రంగానికి చెందిన కార్మికులు, రైతులు మరియు సామాన్య ప్రజలు పడుతున్న అవస్థలను ఆమె స్వయంగా విన్నారు. అధికారులకు విజ్ఞప్తి: డీజిల్ కొరతను నివారించి, సరఫరాను పునరుద్ధరించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మరియు యాజమాన్యాలను కోరారు. ఈ కార్యక్రమంలో నందేటి రాజేష్ , స్వర్ణ లత, అయూబ్ జానీ, రబ్బానీ, మరియు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం గళం ఎత్తారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review