చీరాల, ఆగస్టు 1 :– చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థుల కోసం “సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ (ఎస్డీఎల్సీ)” అంశంపై శనివారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ సంస్థలో సీనియర్ నెట్వర్క్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఎ. కౌశిక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియలో ఎస్డీఎల్సీ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిర్వహణ వరకు ప్రతి దశలో దీనికి ఉన్న ప్రాముఖ్యతను ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి వివిధ దశలు, పరిశ్రమలో వాటి అమలు విధానం, నాణ్యమైన సాఫ్ట్వేర్ తయారీలో అనుసరించాల్సిన ప్రమాణాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ప్రస్తుత ఐటీ రంగంలో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, ఆ రంగంలో రాణించేందుకు అవసరమైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఫుల్ స్టాక్ డెవలపర్గా కెరీర్ను నిర్మించుకునే మార్గాలు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమానికి టి. శేషసాయి కన్వీనర్గా వ్యవహరించగా, సీఎస్ఈ విభాగ అధ్యాపకులు, బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా వెల్లడించగా, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డా. జగదీష్ బాబు, సీఎస్ఈ విభాగాధిపతి డా. పి. హరిణి తెలిపారు.



