జిల్లాలో పెట్రోల్, డీజిల్ పరిస్థితులను పర్యవేక్షించుటకు జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల్లో బంకులను విస్తృతంగా తనిఖీ చేస్ఆతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి అధికారులు తిరిగి తనిఖీలు ప్రారంభించి, సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ పెట్రోల్ బంక్ లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగా డీజిల్ సరఫరాలో కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన తప్పవని హెచ్చరించారు.
Total Views: 2



