విజయవాడ:- భవానీపురం రైతు బజార్ను కూటమి నాయకులు సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుజనా చౌదరి బృందంతో పాటు టీడీపీ నాయకుడు శ్రీధర్, జనసేన నాయకులు పాల్గొన్నారు. రైతు బజార్లోని ప్రతి దుకాణాన్ని సందర్శించిన నాయకులు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సుగుణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను నాయకులు రైతులకు వివరించారు. ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే సుగుణ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టే కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.



