GUNTUR CITY NEWS: పట్టాభిపురం గ్రంధాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

Karthik
7 Views

గుంటూరులోని పట్టాభిపురం శాఖ గ్రంధాలయంంలో మంగళవారం వేసవి శిక్షణా తరగతులు ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ పాల్గొన్నారు. వేసవి శిక్షణ తరగతులకు నిర్వహించడానికి ముందుకొచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షణ్ముఖ కోలాటం మాస్టర్, కళ్యాణ్ సంగీతం నేర్పించడానికి, టీ ప్రమీలా దేవి క్రాఫ్ట్ టీచర్, ఎం. జ్యోతి డ్రాయింగ్ టీచర్, ఎస్కే షకీరా బేగం, అజంత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డైరెక్టర్ టి. సుహాసిని ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ఈ వేసవ శిక్షణ తరగతుల యొక్క ఉపయోగాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సమ్మర్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకొని సెల్ఫోన్ లకి దూరంగా ఉండడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అని విద్యార్థులకు వివరించారు. సెలవలను సార్ధకంగా గడపాలనుకునే చిన్నారుల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామని గ్రంథాలయ అధికారిని పి. సత్యశిరీష తెలియజేశారు.

Author
Total Views: 7
Share This Article
Leave a review