GUNTUR CITY NEWS: పి.జి.ఆర్.ఎస్ అర్జీలు పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలి

Karthik

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో అందిన అర్జీలు పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ అర్జీపై స్పష్టమైన విచారణ చేయాలన్నారు. అర్జీదారు సంతృప్తి మేరకు పరిష్కారం కావాలని, సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. అర్జీలు పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కు మొత్తం 489 అర్జీలు అందాయి. అందులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 230, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 179 అర్జీలు, గుంటూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 6 అర్జీలు, తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో 21 అర్జీలు, గుంటూరు నగర పాలక సంస్థకు 48, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో 5 అర్జీలు అందాయి.అర్జీదారులు పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు చేయాలని, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఆర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగ రాజు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పర్యాటక అధికారి రమ్య, దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ మాధవి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి పి.శేష శ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు,పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ టి. నరసింహా రెడ్డి, ఎ.పిఎం.ఐ.పి ఎల్. వజ్రశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review