GUNTUR CITY NEWS: ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి

Karthik
6 Views

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను వినిపించగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి సంబంధిత అధికారులతో సంప్రదించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం 36వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే మాధవి ఆదేశించారు.

Author
Share This Article
Leave a review