GUNTUR DISTRICT NEWS: కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

Karthik
1 View

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని, నసీర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.‌ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ టీడీపీ, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి వారికి సహాయపడే పార్టీ. పనిచేసే వారందరికీ పార్టీలో గుర్తింపు ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కార్యకర్తలను ఆర్థికంగా స్థిరపడే విధంగా చర్యలు తీసుకుంటాం.వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం ఇస్తే గుంటూరు నగరాన్ని అమెరికా స్థాయిలో అభివృధ్ధి చేస్తాం. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి కార్యకర్త పైన ఉందని వారు వెల్లడించారు.

Author
Share This Article
Leave a review