చిలకలూరిపేట:అవార్డులు, పురస్కారాలు అధికారికి బాధ్యత పెంచుతాయి. ఇవి అధికారుల పనితీరుకు, పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తాయి. ప్రజసేవలో నిబద్ధతతో పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందనడానికి చిలకలూరిపేట అధికారులకు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్బంగా లభించిన పురస్కారాలు నిదర్శనంగా చెప్పవచ్చు.
అర్బన్సీఐ పి రమేష్కు మరో సారి పురస్కారం
ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు అర్బన్సీఐ పి రమేష్కు గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఇటీవలే పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు సంక్రాంతి సందర్బంగా అర్బన్ సీఐ పి రమేష్ కు రెండు పురస్కారాలు అందజేశారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను ప్రాతిపదికగా తీసుకొని చేసిన ఎంపికలో రిసెప్షన్ నుంచి కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ వరకు బాధ్యతాయుతంగా పనిచేసిన విధానాన్ని పరిశీలించి ఎస్పీ ఉత్తమ పోలీస్స్టేషన్గా ప్రకటించారు. దీంతో పాటు కేసుల పురోగతిలోనూ ముందంజలో ఉండటంతో అర్బన్ సీఐ ఆ పురస్కారాన్ని అందుకున్నారు. వ్యక్తిగతంలో ఆయన పనితీరు, సామర్ధం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని పి రమేష్ బెస్ట్ సీఐ ఆవార్డు కూడా సొంతం చేసుకోవడం విశేషం. కొద్ది రోజుల్లోనే తిరిగి జిల్లా కలెక్టర్ నుంచి పురస్కారం అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు ఉత్తమ సేవలు అందించిన రూరల్ ఎస్ ఐ అనిల్కుమార్, అర్బన్ పోలీసు స్టేషన్లో ఏ ఎస్ఐగా పనిచేస్తున్న సుబ్బారావు ఉత్తమ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా పురస్కారాలు అందుకున్నారు.