Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Narsaraopeta :బెట్టింగ్ లకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్ గారు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం.

గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి పై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ ఎస్పీ గారు తెలిపారు.

ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కుటుంబ సభ్యులు తమ బిడ్డలు కానీ, తమ భర్తలు కానీ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని,
ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు గుర్తించాలి.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు సమాచారం ఎవరిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
డయల్ 100/112 కు సమాచారం అందించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button