ఆయుష్ ఆసుపత్రి, అనుబంధ సంస్థలు ఏర్పాటుకు ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలో స్థల పరిశీలన జరిగింది. కేంద్ర యోగ మరియు ప్రకృతి వైద్య పరిశోధన మండలి (Central Council for Research in Yoga & Naturopathy (CCRYN)) సంచాలకులు డా.జ్యోతి కేశ్వాణి (Dr. Jyoti Keswani), ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ – కన్సల్టెంట్ ప్రమోద్ వర్మ (Pramod Verma), పరిశోధన అధికారి డా. ఎన్.వి. ఙ్ఞాన దీప్ తటావర్తి (Gnana Deep Tatavarti) పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ (C.M.Saikanth Varma) వివరాలు తెలిపారు. గుంటూరు పట్టణానికి అతి సమీపంలో ఆయుష్ ఆసుపత్రి, అనుబంధ సంస్థలు రావడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ, ఆయుష్ విభాగం సంచాలకులు ఆర్.గోపాల కృష్ణ, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, తహసిల్దార్ వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.



