బాపట్ల:- సూర్యలంక రోడ్డులోని వ్యవసాయ కళాశాల డాక్టర్ బి.వి. నాథ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవ (కాన్వొకేషన్) కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ సయ్యద్ అబ్దుల్ నజీర్కు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి కార్యక్రమానికి స్వాగతం తెలిపిన ఎమ్మెల్యే, విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న స్నాతకోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం గవర్నర్తో కలిసి కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొని పట్టభద్ర విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పాలడుగు వి. సత్యనారాయణ, కళాశాల అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



