GUNTUR DISTRICT NEWS: ఎంపీ ల్యాడ్స్ సకాలంలో ఖర్చు చేయాలి: కలెక్టర్

Karthik

ఎం పి ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాల్సిoదిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వి.సి. హాల్లో ఎం పి ల్యాడ్స్ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ శివారు తురకపాలెం వద్ద స్లాబ్ కల్వర్టు నిర్మాణ పనులు, అలాగే గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామంలోని హిందూ శ్మశానవాటికలో కర్మశాల భవన నిర్మాణ పనులను విచారించారు. అదేవిధంగా ఎం పి ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాల్సిoదిగా అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శేషాశ్రీ, వివిధ కార్యనిర్వాహక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

Author
Share This Article
Leave a review