AP POLITICAL NEWS: టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సమీక్ష

Karthik

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ భేటీలో మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో ప్రతిబింబించాలి. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా చాటాలి. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలి. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నుదన్నుగా ఉన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలి. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని సూచించారు.

Author
Share This Article
Leave a review