దర్శి:-ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వినాయక చవితి శరన్నవరాత్రి వేడుకలు ఆరో రోజుకు చేరుకున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొల్పిన గణనాథుల మండపాలు భక్తుల శివనామస్మరణలు, వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగాయి. శనివారం పండగ సందర్భంగా భక్తులు వినాయక స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రూ. 56,000 నోట్ల పూలదండతో స్వామివారి అలంకరణ:
దర్శి పట్టణంలోని పుచ్చలమెట్ట ఒకటవ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక్కడ కొలువుదీరిన లంబోదరునికి రూ. 56,000 విలువైన కరెన్సీ నోట్లతో రూపొందించిన ప్రత్యేక పూలదండను అలంకరించారు. ₹500, ₹200, ₹100, ₹50, ₹20, మరియు ₹10 రూపాయల నోట్లతో ఎంతో శోభాయమానంగా తయారు చేసిన ఈ ధనమాల గణనాథుని రూపురేఖలను మరింత దివ్యంగా తీర్చిదిద్దింది. ఈ వినూత్న అలంకరణను తిలకించేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.కొత్తకోటలో అభయాంజనేయ స్వామి (Abhayanjaneya Swamy Temple) ప్రతిష్ఠ మహోత్సవం!
అదేవిధంగా, పుచ్చలమెట్ట ఐదవ రోడ్డులోని వినాయక మండపం వద్ద కూడా ఉదయం నుంచే ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా సాగాయి. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, భక్తిపారవశ్యం నడుమ కోలాహలంగా కొనసాగుతున్నాయి.



