AP LATEST NEWS: మంత్రులతో సీఎం నారా చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ – పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ఇండి కూటమి పక్షాల తీరును నిరసిస్తూ ఎన్డీఏ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం

Karthik
4 Views

టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ. మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని ఇండి కూటమి పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయి. మహిళలకు న్యాయం చేయాలని మొదటి నుంచీ ఎన్డీఏ పార్టీలు కృషి చేశాయి. ఇండి కూటమి మహిళలకు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకుని ఒక్క మహిళ కూడా ఇండి కూటమి పార్టీలకు ఓటేయకూడదు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలు మహిళలకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలి. ఇండి కూటమి పార్టీల తీరును నిరసిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలి. ఇండి కూటమి పార్టీలు చేసిన అన్యాయంపై ‘స్త్రీ శక్తి’ పేరుతో సదస్సులు నిర్వహించాలి. టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు సమన్వయంతో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలి. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో నిరసనలు తెలపాలి. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసింది. 1996 నుంచి చట్టసభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది… కానీ లోక్‌సభలో కాంగ్రెస్ బిల్లు పెట్టలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలో పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండి కూటమి అడ్డుకుంది. డీలిమిటేషన్ సాకు చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వకుండా వీగిపోయేలా చేశారు. 50 శాతం సీట్లు పెంచేలా ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ రాష్ట్రానికీ ఇబ్బంది రానీయకుండా చూసుకుంటామని అమిత్ షా చెప్పారు. అవసరమైతే బిల్లులో మార్పులు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేలు డీలిమిటేషన్ సాకు చూపాయి. దేశంలో మహిళా విశ్వవిద్యాలయం తొలిసారిగా ఎన్టీఆరే పెట్టారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించింది మనమే. ఎన్డీఏ మహిళా పక్షపాతి… ఇండి కూటమి మహిళా వ్యతిరేకి.

Author
Share This Article
Leave a review