పర్చూరు (బాపట్ల జిల్లా):– అక్రమ అరెస్ట్లతో అణచాలని చూసినా, 53 రోజుల సుదీర్ఘ నిర్బంధంతో భయపెట్టాలని కుట్రలు పన్నినా ప్రజాభిమానాన్ని, నాయకుడి ధైర్యాన్ని ఏ శక్తీ అడ్డుకోలేకపోయాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
అధినేత నారా చంద్రబాబు నాయుడి పట్ల ధైర్యాన్ని, సంఘీభావాన్ని తెలియజేస్తూ పార్టీ పిలుపు మేరకు పర్చూరు నియోజకవర్గంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వయంగా కొవ్వొత్తులు వెలిగించి నిరసనతో పాటు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా నిజం గెలుస్తుందని, న్యాయమే నిలుస్తుందని స్పష్టం చేశారు. నాయకుడిపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ, విశ్వాసం ముందు అక్రమ నిర్బంధాలు నిలవలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొనడంతో పర్చూరు వ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.



