విశాఖపట్నం: విశాఖపట్నంలోని ప్రముఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తీర ప్రాంతాన్ని, సముద్ర గర్భాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు చేపట్టిన ‘సాగర స్వచ్ఛత’ కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించడమే కాకుండా అధికారులతో, స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు:

తీరంలో ఆత్మీయ పలకరింపు – ఒంటరి మహిళకు పెన్షన్ మంజూరు: ఆర్కే బీచ్ తీరంలో ‘మురి మిక్చర్’ విక్రయించే ఓ మహిళ వద్దకు వెళ్లిన సీఎం, ఆమె జీవనోపాధి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విక్రయించే మురి మిక్చర్ను స్వయంగా రుచి చూసి ఆస్వాదించారు. సంభాషణ మధ్యలో ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి, వెంటనే ఆమెకు పింఛన్ మంజూరు చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.Visakha district News
అధికారుల ప్రణాళికలు, క్షేత్రస్థాయి సిబ్బంది శ్రమ, ప్రజల భాగస్వామ్యంతో విశాఖ తీరం స్వచ్ఛతకు నిలయంగా మారుతుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.



