GUNTUR BREAKING NEWS: క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన 15 మంది నిందితుల ముఠా అరెస్ట్

Karthik
8 Views

గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జయరాం నాయక్, షేక్ రియాజ్ అనే ప్రధాన ముద్దాయిలు ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ కు నిర్వహిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం మీడియాకు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్ధికంగా నష్టం జరగడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Author
Share This Article
Leave a review